News August 3, 2024
ప్రభుత్వం నుంచి ఏమాత్రం ప్రోత్సాహం లేదు: షూటర్ అర్జున్

పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో కాంస్యాన్ని చేజార్చుకున్నారు. స్వరాష్ట్రం పంజాబ్కు చేరుకున్న ఆయన, అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటి, గత ప్రభుత్వాలు నాకెటువంటి ప్రోత్సాహాన్నీ ఇవ్వలేదు. ఉద్యోగంపై సీఎం మాన్ 2022లో హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. చాలా లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వాలు మారినా స్పందన మాత్రం ఉండటం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News March 10, 2026
సల్మాన్ మూవీలో హీరోయిన్గా సమంత?

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే సూపర్ హీరో ఫిల్మ్లో సమంత హీరోయిన్గా నటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్&డీకే ద్వయం ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హ్యూమర్+యాక్షన్ ఉంటుందని సమాచారం. కాగా డైరెక్టర్ల ద్వయంలో ఒకరైన రాజ్ను సామ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.
News March 10, 2026
యుద్ధం.. పడిపోతున్న బియ్యం ధరలు

మిడిల్ ఈస్ట్లో యుద్ధం వరి రైతులపైనా ప్రభావం చూపుతోంది. చెన్నై పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోగా, ఇప్పటికే బయల్దేరిన కంటైనర్లూ వెనక్కి వచ్చేశాయి. దీంతో వారం కిందటి వరకు పుట్టి(850KG) ధాన్యం ధర ₹22,500 ఉండగా ప్రస్తుతం ₹21Kకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఎక్స్పోర్ట్స్ నిలిచిపోతే రేట్లు మరింత పతనం కానున్నాయి. అలాగే $11.8Bn విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడనుందని అంచనా.
News March 10, 2026
ఫైళ్ల దహనం వెనకున్న ప్లాన్ ఏంటో తేలాలి: సుప్రీంకోర్టు

AP: మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైళ్ల దహనం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రికార్డు రూమ్లో మంటలు ఎలా అంటుకున్నాయి? దాని వెనకున్న ప్లాన్ ఏంటో లోతుగా విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్కు నిరాకరించింది. ఘటన సమయంలో నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.


