News August 3, 2024
ప్రభుత్వం నుంచి ఏమాత్రం ప్రోత్సాహం లేదు: షూటర్ అర్జున్

పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో కాంస్యాన్ని చేజార్చుకున్నారు. స్వరాష్ట్రం పంజాబ్కు చేరుకున్న ఆయన, అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటి, గత ప్రభుత్వాలు నాకెటువంటి ప్రోత్సాహాన్నీ ఇవ్వలేదు. ఉద్యోగంపై సీఎం మాన్ 2022లో హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. చాలా లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వాలు మారినా స్పందన మాత్రం ఉండటం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 9, 2025
పవన్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ ఏమన్నారంటే?

AP: Dy.CM పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తెలిపారు. పవన్కు TG ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. ఆ మాటలపై అనవసర రాద్దాంతం చేశారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
News December 9, 2025
మా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్: గల్లా జయదేవ్

TG: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని మాజీ ఎంపీ, అమర్రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో రూ.9వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.
News December 9, 2025
చైనాకు వెళ్తుంటే జాగ్రత్త!

భారతీయులు చైనాకు వెళ్తున్నా, ఆ దేశం మీదుగా ప్రయాణిస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ సూచించింది. ఇటీవల షాంఘై ఎయిర్పోర్టులో AR.P మహిళను <<18509379>>నిర్బంధించిన<<>> నేపథ్యంలో హెచ్చరించింది. భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. నిర్బంధించడం మానుకొని విమాన ప్రయాణ నిబంధనలు గౌరవిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.


