News August 3, 2024
మహా పరిణామాలు: షిండేతో శరద్ పవార్, రాజ్ ఠాక్రే చర్చలు

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. CM ఏక్నాథ్ షిండేను శరద్ పవార్, రాజ్ఠాక్రే (MNS) వేర్వేరుగా కలిశారు. రాజకీయంగా కీలకమైన మరాఠా రిజర్వేషన్లు, ఇంటి నిర్మాణ ప్రాజెక్టులపై వీరు చర్చించారు. LS ఎన్నికల్లో BJPకి మద్దతిచ్చిన ఠాక్రే చాలా సందర్భాల్లో షిండేను విమర్శిస్తున్నారు. ఇక MVA కూటమి నుంచి పవార్ ఒక్కరే షిండేను కలుస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ముందు వీరి చర్చలు ఆసక్తికరంగా మారాయి.
Similar News
News March 18, 2026
జనం సెక్సువల్ కంటెంట్ చూస్తున్నారు: రక్షిత

‘KD: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునర్’ పాట అసభ్యంగా ఉందన్న <<19406830>>విమర్శల<<>>పై డైరెక్టర్ ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. గతంలో వచ్చిన ఈ తరహా పాటలకులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం జనం రక్తపాతం, సెక్సువల్ కంటెంట్ను చూస్తున్నారని, కేవలం ఒక్క పాటతో తన భర్తను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిపడ్డారు. కన్నడ సినిమాలను థియేటర్లకు చేర్చడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని కోరారు.
News March 18, 2026
2028లో తెలంగాణలో ఎన్నికలు రావు: రేవంత్

TG: 2029లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగవని CM రేవంత్ ఢిల్లీలో అన్నారు. అంతకంటే ముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే అని చెప్పారు. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే TDP MP పుట్టా మహేశ్కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్ను నియమించినట్లు మీడియా చిట్చాట్లో తెలిపారు.
News March 18, 2026
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


