News August 4, 2024
శ్రీలంకతో రెండో వన్డే.. భారత్ ఓటమి

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా ఓడిపోయింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (64) అక్షర్ పటేల్ (44) రాణించగా గిల్(35) ఫర్వాలేదనిపించారు. కోహ్లీ (14), దూబే (0), కేఎల్ రాహుల్ (0), అయ్యర్ (7) తీవ్రంగా నిరాశపర్చారు. ఆ తర్వాత బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్ వండర్సే ఒక్కడే 6 వికెట్లు తీసి లంకను గెలిపించారు.
Similar News
News January 13, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’.. చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే?

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ మూవీకి చిరు కూతురు సుష్మిత కో-ప్రొడ్యూసర్గా ఉన్న విషయం తెలిసిందే. కాగా 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు రూ.కోటితో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు రూ.50 కోట్లు, భోళా శంకర్కు రూ.63 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
News January 13, 2026
మున్సిపాలిటీ ఓటర్లు.. అత్యధికం ఎక్కడంటే?

TG: రాష్ట్రంలో మొత్తం 123 మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 2,996 వార్డులుండగా 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల పరంగా అత్యధికంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3,48,051, అత్యల్పంగా వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీలో 9,147 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 123 మున్సిపాలిటీల్లో 113 చోట్ల మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.
News January 13, 2026
టాక్సిక్ టీజర్ వివాదం.. సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదన్న CBFC

కన్నడ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ టీజర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అశ్లీల సన్నివేశాలపై ఆప్ <<18843954>>ఫిర్యాదు<<>> చేయడంతో వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు కర్ణాటక మహిళా కమిషన్ లేఖ రాసింది. దీంతో యూట్యూబ్లో విడుదల చేసే టీజర్లకు సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదని CBFC తెలిపింది. థియేటర్లలో ప్రదర్శించే వాటికే పర్మిషన్ అవసరమని, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ఫాం కావడంతో తమ పరిధిలోకి రాదని చెప్పింది.


