News August 5, 2024
నోరు తెరిచిన మమ్మీ.. సైంటిస్టులు ఏం చెప్పారంటే!

ఈజిప్టులో నోరు తెరిచిన స్థితిలో ఉన్న మమ్మీని 1935లో ఆర్కియాలజిస్టులు గుర్తించారు. ఆ మహిళ 3500 ఏళ్ల క్రితం చనిపోయినట్లు అంచనా వేశారు. కాగా పలు పరిశోధనలు చేసినా ఆమె నోరు తెరిచి ఉండటానికి ఓ నిర్దిష్టమైన కారణాన్ని చెప్పలేకపోయారు. హింసాత్మక మరణం, నొప్పితో అరుస్తూ చనిపోవడం, మృతదేహాన్ని భద్రపరిచే విధానంలో లోపం, కుళ్లిపోయే ప్రక్రియ, మృతదేహాలను బలంగా చుట్టేయడం వంటివి కారణాలు కావొచ్చని ఇటీవల వెల్లడించారు.
Similar News
News January 16, 2026
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 5 ఏళ్ల జైలు

దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ విధించి విఫలమైన మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అరెస్టు కాకుండా అధికారులను అడ్డుకోవడం, పత్రాల ఫోర్జరీ వంటి కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. ఆ దేశ చరిత్రలో పదవిలో ఉండగా అరెస్టయిన తొలి అధ్యక్షుడు ఆయన. అయితే ఆయనపై ఉన్న అత్యంత తీవ్రమైన ‘రాజద్రోహం’ కేసులో ప్రాసిక్యూటర్లు మరణశిక్ష కోరగా.. దానిపై ఫిబ్రవరిలో తుది తీర్పు వెలువడనుంది.
News January 16, 2026
ESIC మెడికల్ కాలేజీ&హాస్పిటల్లో ఉద్యోగాలు

నోయిడాలోని<
News January 16, 2026
జస్టిస్ యశ్వంత్ వర్మకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

తనపై పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తును సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తుల విచారణ చట్టం 1965 ప్రకారం ఉమ్మడి కమిటీ తప్పనిసరి అనే ఆయన వాదనను తోసిపుచ్చింది. లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తదుపరి చర్యలు చేపట్టడానికి అడ్డంకులను తొలగిస్తూ తీర్పు వెలువరించింది. 2025 మార్చిలో యశ్వంత్ నివాసంలో భారీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే.


