News August 5, 2024
నోరు తెరిచిన మమ్మీ.. సైంటిస్టులు ఏం చెప్పారంటే!

ఈజిప్టులో నోరు తెరిచిన స్థితిలో ఉన్న మమ్మీని 1935లో ఆర్కియాలజిస్టులు గుర్తించారు. ఆ మహిళ 3500 ఏళ్ల క్రితం చనిపోయినట్లు అంచనా వేశారు. కాగా పలు పరిశోధనలు చేసినా ఆమె నోరు తెరిచి ఉండటానికి ఓ నిర్దిష్టమైన కారణాన్ని చెప్పలేకపోయారు. హింసాత్మక మరణం, నొప్పితో అరుస్తూ చనిపోవడం, మృతదేహాన్ని భద్రపరిచే విధానంలో లోపం, కుళ్లిపోయే ప్రక్రియ, మృతదేహాలను బలంగా చుట్టేయడం వంటివి కారణాలు కావొచ్చని ఇటీవల వెల్లడించారు.
Similar News
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<
News December 13, 2025
ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.


