News August 5, 2024
స్వయంప్రతిపత్తిని లాక్కొనే ప్రయత్నం: అసదుద్దీన్ ఒవైసీ

మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వక్ఫ్ బోర్డ్ స్వయంప్రతిపత్తిని లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ప్రతిపాదనలు పార్లమెంటు ముందుకు రాకుండానే మీడియాలో రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సవరణలు అమోదం పొందితే ఆస్తుల ఆక్రమణలపై విచారణ జరిపే వక్ఫ్ ట్రిబ్యునల్ అన్ని హక్కులు కోల్పోతుందని ఆయన వివరించారు.
Similar News
News March 11, 2026
స్టాక్ మార్కెట్లు క్రాష్

యుద్ధం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫ్లాట్గా స్టార్ట్ అయిన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు కోల్పోయాయి. సన్ ఫార్మా, ఎన్టీపీసీ మినహా అన్ని కంపెనీల షేర్లు ఘోర నష్టాలు చవిచూశాయి. FII అమ్మకాలు, ప్రాఫిట్ బుకింగ్, ఇరాన్పై దాడులు కొనసాగుతుండడం మార్కెట్లపై ప్రభావం చూపించింది.
News March 11, 2026
యూజర్లకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్?

మొబైల్ డేటాపై ట్యాక్స్ విధించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేయాలని టెలికం విభాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇది ఆదాయం పెంచడంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆలోచిస్తుందట. ఒక GB డేటాపై ₹1 ట్యాక్స్ వేసినా ఏటా ₹22,900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
News March 11, 2026
రాష్ట్రంలో మూడో డిస్కం

TG: రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటైంది. దీనికి తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TGRPDCL)గా పేరు పెడుతూ ప్రభుత్వం GO జారీ చేసింది. CMDగా ముషారఫ్ అలీ ఫరూఖీని, మరో నలుగురు డైరెక్టర్లను నియమించింది. వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, వాటర్ సప్లై స్కీమ్/మిషన్ భగీరథ, HMWSSB, మున్సిపల్ వాటర్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించనుంది. కొత్త వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వనుంది.


