News August 5, 2024
అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు దొంగల ప్రతాపం

ప్రకృతి విలయంతో విలవిల్లాడుతున్న వయనాడ్ ప్రజలకు కొత్తగా దొంగల బెడద పట్టుకుంది. వాలంటీర్ల రూపంలో దొంగలు చెలరేగిపోతున్నారని, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారని బాధితులు వాపోతున్నారు. చూరల్మల, ముండక్కై గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో అధికారులు గ్రామస్థులను ఇళ్లు ఖాళీ చేయించి శిబిరాలకు తరలించారు. ఇదే అదనుగా కొందరు ఆ ఇళ్లను దోచుకుంటున్నారు. దీంతో వాలంటీర్లకు ఐడీ కార్డులు ఇవ్వడం ప్రారంభించారు.
Similar News
News March 26, 2026
50ల్లోనూ యవ్వనంగా.. మలైకా సీక్రెట్ ఇదే?

3 రకాల వాటర్ షాట్స్ థెరపీ 52 ఏళ్ల వయసులోనూ తనను ఫిట్&అందంగా ఉంచుతోందని మలైకా అరోరా తెలిపారు.
ఇమ్యూనిటీ షాట్: అల్లం, పసుపు, పుదీనా, తులసి ఆకులు, చియా సీడ్స్, తేనె కలిసిన నీటిని తాగడం.
డైజెస్టివ్ షాట్: రాత్రి గ్లాస్ వాటర్లో టీస్పూన్ చొప్పున వాము, జీలకర్ర, సోంపు, మెంతి గింజలు నానబెట్టిన నీరు తీసుకోవడం.
గ్లో షాట్: అలోవేరా జెల్ కలిపిన నీటిలో అవసరమైతే చియా సీడ్స్, సబ్జా గింజలు యాడ్ చేసుకొని తాగడం.
News March 26, 2026
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, ఆసిఫాబాద్, సంగారెడ్డి, MDK, కామారెడ్డిలో ఉరుములు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HYD, WGL, జనగామ, SDPT, యాదాద్రి, RR, మేడ్చల్, MBNR, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, PDPL, నాగర్ కర్నూల్, వనపర్తి, NRPT, GDWL జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News March 26, 2026
రాష్ట్రంలో కాగితాలపైనే పోలీసులు: జగన్

AP జంగిల్ రాజ్గా మారిపోయిందని, కాగితాలపై మాత్రమే పోలీసులు కన్పిస్తున్నారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో 17ఏళ్ల గిరిజన బాలికపై హత్యాచారం వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. ఇక ఇవాళ మార్కాపురం ఘటనలో మరో భయానక వైఫల్యం బయటపడిందన్నారు. పలుమార్లు 100కు ఫోన్ చేసినా స్పందించలేదని చెప్పారు. CBN ప్రభుత్వంలో PR స్టంట్లు తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయిందని ట్వీట్ చేశారు.


