News August 5, 2024
అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు దొంగల ప్రతాపం

ప్రకృతి విలయంతో విలవిల్లాడుతున్న వయనాడ్ ప్రజలకు కొత్తగా దొంగల బెడద పట్టుకుంది. వాలంటీర్ల రూపంలో దొంగలు చెలరేగిపోతున్నారని, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారని బాధితులు వాపోతున్నారు. చూరల్మల, ముండక్కై గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో అధికారులు గ్రామస్థులను ఇళ్లు ఖాళీ చేయించి శిబిరాలకు తరలించారు. ఇదే అదనుగా కొందరు ఆ ఇళ్లను దోచుకుంటున్నారు. దీంతో వాలంటీర్లకు ఐడీ కార్డులు ఇవ్వడం ప్రారంభించారు.
Similar News
News December 13, 2025
₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009-14 మధ్య 7,599 KM న్యూ ట్రాక్ వేస్తే, 2014-24 వరకు తాము 34,428 KM నిర్మించామని తెలిపారు. ₹6,74,920 కోట్లతో కొత్త రైల్వే లేన్లు, మల్టీ ట్రాకింగ్, గేజ్ కన్వర్షన్ చేపట్టామన్నారు. ఇప్పటికే 12,769 KMల నిర్మాణం పూర్తయిందన్నారు. పెరుగుతున్న సరకు రవాణా దృష్ట్యా నెట్వర్క్ కెపాసిటీ పెంచుతున్నామని చెప్పారు.
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
బిగ్బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్లో సంజన/భరణి/డెమోన్ పవన్లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.


