News August 5, 2024
మహిళల T20 వరల్డ్ కప్పై నీలినీడలు!

బంగ్లాదేశ్లో ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకోవడం, సైనిక పాలనతో ఆ దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో అక్టోబర్ నుంచి ఆ దేశంలో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీని వేరే దేశానికి తరలించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వరల్డ్ కప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 16, 2026
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

AP: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 18 గంటల వరకు టైమ్ పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. గురువారం వేంకటేశ్వరుడిని 64,064 మంది దర్శించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.80కోట్లు ఆదాయం వచ్చిందని TTD ప్రకటించింది.
News January 16, 2026
ఇరాన్ వీధుల్లో అద్దె సైనికులు

ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలను అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ భద్రతా బలగాలపై నమ్మకం తగ్గడంతో ఇరాక్ నుంచి కిరాయికి యువకులను రప్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యాత్రికుల ముసుగులో వీరంతా ఇరాన్లోకి చొరబడుతున్నారని, అనంతరం నిరసనకారులపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ వంటి వారు ఇందులో ఉన్నట్లు సమాచారం.
News January 16, 2026
NTPCలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


