News August 6, 2024

Olympics: అందినట్లే అంది..

image

పారిస్ ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకాలు చేజారడం క్రీడాకారులతో పాటు అభిమానులకు తీవ్ర నిరాశ మిగులుస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న వారు సైతం పతక పోరులో వెనుదిరుగుతున్నారు. దాదాపు ఏడెనిమిది పతకాలు చివరి క్షణంలో దూరమయ్యాయి. అయితే ఇతర వరల్డ్ టోర్నీల్లో దుమ్ములేపుతున్న మనవాళ్లు ఒలింపిక్స్‌లో తడబడటానికి కారణం ఒత్తిడే అంటున్నారు క్రీడా నిపుణులు. మానసిక దృఢత్వంలో మనోళ్లను తీర్చిదిద్దితే పతకాలు పెరుగుతాయంటున్నారు.

Similar News

News September 17, 2025

ప్రధానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము PM మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’ అని ఆకాంక్షించారు. ‘సరైన సమయంలో సరైన నాయకత్వం దొరకడం మన అదృష్టం. ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేలా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’ అని CM చంద్రబాబు ట్వీట్ చేశారు. Dy.CM పవన్, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్‌ కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.

News September 17, 2025

AICTE ప్రగతి స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<> AICTE<<>> , కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్లు ఆర్థిక సాయం చేస్తారు.

News September 17, 2025

JAM-2026కు దరఖాస్తు చేశారా?

image

<>JAM<<>>-2026కు దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 12 ఆఖరు తేదీ. ఐఐటీల్లో బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ విభాగంలో పీజీలో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.2000(రెండు పేపర్లకు రూ.2700), మహిళలు, SC, ST, దివ్యాంగులు రూ.1000 (రెండు పేపర్లకు రూ.1,350) చెల్లించాలి.