News August 7, 2024
గెలవాల్సిందే..

ఇవాళ భారత్, శ్రీలంక మధ్య మూడో వన్డే జరగనుంది. తొలి వన్డే టై కాగా రెండో వన్డేలో SL విజయం సాధించింది. సిరీస్ సమం కావాలంటే మూడో వన్డేలో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఫలితం మారితే సిరీస్ శ్రీలంక వశం కానుంది. రోహిత్ మినహా మిగతా బ్యాటర్లు రాణించలేకపోవడం భారత జట్టును ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచులోనైనా సత్తా చాటి విజయాన్ని అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News April 5, 2026
PHOTO GALLERY: ఉప్పల్లో SRH మ్యాచ్

IPL: ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH, LSG మ్యాచుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు 39వేల మంది వచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ సైతం స్టేడియానికి వచ్చి ప్లేయర్లను ఎంకరేజ్ చేశారు. చేతిలో ఆరెంజ్ జెండా పట్టుకొని ఉత్తేజపరిచారు. SRH ఓనర్ కావ్య, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా, ఇషాన్ కిషన్ ప్రేయసి అదితి హుండియా, బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్, నిర్మాత సురేశ్ బాబు సందడి చేశారు.
News April 5, 2026
ట్రంప్కు పిచ్చి పట్టిందా?

‘హార్ముజ్ను కంట్రోల్లోకి తీసుకోవడం మాకో లెక్క కాదు. రెండు నిమిషాల పని’ అని 6 రోజుల క్రితం ట్రంప్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడేమో మంగళవారం లోపు దాన్ని తెరవాలని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు బా*ర్డ్స్ అంటూ చిల్లర భాష మాట్లాడారు. దీంతో ట్రంప్ మెదడు పని చేస్తోందా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
News April 5, 2026
ALERT: 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలో 2 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులుంటాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని చెప్పింది. ఇవాళ 66 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కొన్నిజిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.


