News August 8, 2024

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

image

AP: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ తూర్పు బైపాస్‌కు రూ.2,716 కోట్లు, వినుకొండ-గుంటూరు రోడ్డుకు రూ.2,360 కోట్లు, సబ్బవరం-షీలానగర్ రోడ్డుకు రూ.906 కోట్లు, విజయవాడ మహానాడు జంక్షన్-నిడమానూరు రోడ్డుకు రూ.669 కోట్లు, చెన్నై-కోల్‌కతా హైవేపై రణస్థలం రహదారికి రూ.325 కోట్లు కేటాయించింది.

Similar News

News March 17, 2026

APPLY: ప్రతినెలా రూ.3,000 పెన్షన్

image

చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 చొప్పున పొదుపు చేయాలి. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. రైతు మరణిస్తే భాగస్వామికి 50% పెన్షన్ అందిస్తారు. రైతులు ఆధార్, బ్యాంక్ వివరాలతో ‘మీసేవ’, CSC కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు.

News March 17, 2026

ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్

image

ఇండియాలో గొంతు క్యాన్సర్‌కు పొగ తాగడం, పొగాకు నమలడం ప్రధాన కారణాలు. ఇప్పుడు US, UKలో ఓరల్ సెక్స్‌ ద్వారా అధిక సంఖ్యలో HPV(హ్యూమన్ పాపిలోమా వైరస్) కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో HPV-16, HPV-18 రకాలు గొంతు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయంటున్నారు. ఎక్కువ మందితో లైంగిక సంబంధం, HPV వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

News March 17, 2026

ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్లు విడుదల

image

AP: రంజాన్ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం రూ.45 కోట్లను విడుదల చేసింది. 5వేల మంది ఇమామ్‌లకు రూ.30 కోట్లు, 5 వేల మంది మౌజన్ల అకౌంట్లలో రూ.15 కోట్లు జమ చేసింది. నిన్న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డబ్బులు రిలీజ్ చేసింది.