News August 8, 2024

బ్ర‌ిడ్జి వేశారు.. రోడ్డు విస్త‌ర‌ణ మ‌రిచారు!

image

బిహార్‌లోని అరారియా జిల్లాలో పంట పొలాల మ‌ధ్య ఉన్న ఓ బ్ర‌ిడ్జి వైరల్ అవుతోంది. ప‌రమానంద్పూర్ గ్రామంలో ఇంకిపోయిన న‌ది మీద రోడ్డు నిర్మాణానికి అధికారులు ముందుగా కొంత ప్రాంతాన్ని మాత్ర‌మే సేక‌రించి వంతెన నిర్మించారు. తీరా రోడ్డు విస్త‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన భూమి సేక‌రించ‌కుండా వదిలేశారు. దీంతో పంట‌పొలాల మ‌ధ్య బ్రిడ్జి ఎందుకుందంటూ వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

Similar News

News November 3, 2025

కంకర ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం!

image

TG: చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. కంకర ఓవర్‌లోడ్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ‎‎ఘటనా సమయంలో టిప్పర్‌లోనే యజమాని లక్ష్మణ్‌ ఉన్నారు. లడారం-శంకర్‌పల్లి వరకు టిప్పర్‌ను ఆయనే నడిపారు. ‎ఆ తర్వాత డ్రైవర్‌ ఆకాశ్‌కు ఇచ్చారు. గాయపడిన లక్ష్మణ్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 3, 2025

ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలపై అఫిడవిట్ ఇవ్వండి: సుప్రీం

image

ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంటును ఆదేశించింది. వాయు పర్యవేక్షణ కేంద్రాలు పనిచేయడం లేదన్న మీడియా వార్తలపై ప్రశ్నించింది. CPCB, DPCC, NCR పరిధిలోకి వచ్చే జిల్లాల్లో OCT 14-25 మధ్య పరీక్షించిన గాలి నాణ్యత నివేదికల్ని సమర్పించాలని చెప్పింది. CJI గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ కేసును విచారించి ఆదేశాలిచ్చారు.

News November 3, 2025

మట్టి నింపిన బావులపై ఇల్లు కట్టుకోవచ్చా?

image

లోతట్టు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం సురక్షితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. మట్టి నింపిన బావులు, గుంటలపై ఉండే ఇల్లు ప్రమాదానికి సంకేతమన్నారు. ‘ఈ స్థలాల్లో పునాదులు నిలవలేవు. భూమి జారే అవకాశముంది. నీరు నిలిచి ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది నివాసితుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇంటికి స్థిరత్వం, నివాసితులకు ఆరోగ్యం సిద్ధించాలంటే ఇలాంటి భూములను విడిచిపెట్టాలి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>