News August 10, 2024
గోల్డ్ మెడల్ గెలిచిన బాక్సర్.. కోచ్కు హార్ట్ అటాక్

పారిస్ ఒలింపిక్స్లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ దుస్మంతోవ్ గోల్డ్ మెడల్ గెలిచారు. అయితే అతడితో కలిసి సంబరాలు చేసుకుంటుండగా హెడ్ కోచ్ కిలిచెవ్ గుండెపోటుకు గురయ్యారు. అక్కడే ఉన్న బ్రిటన్కు చెందిన డాక్టర్ హర్జ్ సింగ్, ఫిజియో లిల్లిస్ ఆయనకు CPR చేశారు. డెఫిబ్రిలేటర్తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో కిలిచెవ్ స్పృహలోకి వచ్చారు. సమయస్ఫూర్తితో స్పందించిన హర్జ్ సింగ్, లిల్లీస్పై ప్రశంసలు కురుస్తున్నాయి.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<