News August 10, 2024

గోల్డ్ మెడల్ గెలిచిన బాక్సర్.. కోచ్‌కు హార్ట్ అటాక్

image

పారిస్ ఒలింపిక్స్‌‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్‌ దుస్మంతోవ్ గోల్డ్ మెడల్ గెలిచారు. అయితే అతడితో కలిసి సంబరాలు చేసుకుంటుండగా హెడ్ కోచ్ కిలిచెవ్ గుండెపోటుకు గురయ్యారు. అక్కడే ఉన్న బ్రిటన్‌కు చెందిన డాక్టర్ హర్జ్ సింగ్, ఫిజియో లిల్లిస్ ఆయనకు CPR చేశారు. డెఫిబ్రిలేటర్‌తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో కిలిచెవ్ స్పృహలోకి వచ్చారు. సమయస్ఫూర్తితో స్పందించిన హర్జ్ సింగ్, లిల్లీస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Similar News

News February 15, 2025

WPL: ఆర్సీబీకి కీలక ప్లేయర్ దూరం

image

గత సీజన్లో పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఆర్సీబీ Xలో వెల్లడించింది. ఆమె స్థానంలో స్నేహ్ రాణాను తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా నిన్న జరిగిన మ్యాచులో ఆర్సీబీ రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News February 15, 2025

భారత క్రికెటర్లను హగ్ చేసుకోవద్దు: పాక్ అభిమానులు

image

ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పాకిస్థాన్ ప్లేయర్లకు ఆ దేశ అభిమానులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 23న భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో పాటు టీమ్ ఇండియా క్రికెటర్లను హగ్ చేసుకోవద్దని సందేశాలు పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్, పాక్ మ్యాచ్ అనగానే ఇరుదేశాల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ వార్నింగ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

News February 15, 2025

కులగణన.. రేపటి నుంచి వారికి మరో ఛాన్స్

image

TG: కులగణనలో పాల్గొనని 3,56,323 కుటుంబాల వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు టోల్‌ఫ్రీ నంబర్ 040 21111111కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు వారి ఇంటికెళ్లి వివరాలు సేకరిస్తారు. MPDO, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు. https://seeepcsurvey.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో సర్వే ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని నింపి ప్రజాపాలన కేంద్రంలోనూ ఇవ్వొచ్చు.

error: Content is protected !!