News August 12, 2024
టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

AP: టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని నిర్ణయించనున్నారు. అర్హత ఉన్న SGTలను సబ్జెక్టు టీచర్లుగా హైస్కూళ్లలో నియమిస్తారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.