News August 12, 2024

Stock Markets: క్రాషేం లేదు.. స్వల్ప నష్టాలే

image

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం BSE సెన్సెక్స్ 258 పాయింట్ల నష్టంతో 79,447, NSE నిఫ్టీ 80 పాయింట్లు ఎరుపెక్కి 24,286 వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు నిఫ్టీ 397 పాయింట్లు పతనమై 72,321 వద్ద ట్రేడవుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3, అదానీ పోర్ట్స్ 2 శాతానికి పైగా నష్టపోయాయి.

Similar News

News January 12, 2026

జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత

image

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 10న అర్ధరాత్రి 2 సార్లు స్పృహతప్పి పడిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేసినట్లు చెప్పింది. 2025 మార్చిలోనూ ఆయన ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య కారణాలతో గతేడాది జులైలో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన <<17154846>>రాజీనామా<<>> చేయడం తెలిసిందే.

News January 12, 2026

శాంసంగ్‌కు చెక్.. టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా యాపిల్

image

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో యాపిల్ కంపెనీ నంబర్ వన్‌గా నిలిచింది. ఐఫోన్ 17 సక్సెస్, 16కు భారీ డిమాండ్, సేల్స్‌లో 10 శాతం గ్రోత్ సాధించడంతో గత 14 ఏళ్లలో తొలిసారిగా టాప్‌లోకి వచ్చింది. శాంసంగ్‌ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ 20%, శాంసంగ్ 19%, షియోమీ 13%, వివో 8%, ఒప్పో 8%, ఇతర బ్రాండ్లు 32% వాటా కలిగి ఉన్నాయి.

News January 12, 2026

చర్చలకైనా, యుద్ధానికైనా మేం రెడీ: ఇరాన్

image

దాడి చేస్తామని ట్రంప్ <<18832950>>హెచ్చరిస్తున్న<<>> నేపథ్యంలో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. హింసకు మొస్సాద్ కారణమని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ అనుకూల ర్యాలీల కోసం వేలమందిని రంగంలోకి దించినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పింది. టెహ్రాన్‌తోపాటు ఇతర ప్రధాన సిటీల్లోనూ ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలిపింది.