News August 14, 2024
హైకోర్టులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే 23 మంది అరెస్ట్ కాగా వంశీ ఏ71గా ఉన్నారు. ఆయనపై దాడి కేసుతో పాటు హత్యాయత్నం అభియోగాలున్నాయి.
Similar News
News September 18, 2025
గ్రౌండ్లోకి రాని పాక్ టీమ్.. అంపైర్లు ఏం చేశారో తెలుసా?

2006 AUG 20న ఇంగ్లండ్తో టెస్టులో <<17707677>>పాకిస్థాన్<<>> బాల్ట్యాంపరింగ్ చేసిందని అంపైర్లు గుర్తించి ఇంగ్లిష్ జట్టుకు 5రన్స్ పెనాల్టీ కింద ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాక్ ఆటగాళ్లు టీ బ్రేక్ తర్వాత మైదానంలోకి వచ్చేందుకు నిరాకరించారు. పాకిస్థాన్కు రెండుసార్లు అవకాశం ఇచ్చినా వాళ్లు గ్రౌండ్లోకి రాలేదు. దీంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన అంపైర్లు బెయిల్స్ తీసేసి ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించారు.
News September 17, 2025
మరో 3 గంటలు భారీ వర్షం.. జాగ్రత్త!

TG: హైదరాబాద్లో <<17744168>>వర్షం<<>> దంచికొడుతోంది. మరో 3 గంటలు వాన కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అటు రాబోయే 2-3 గంటల్లో ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, యాదాద్రి, NZB, సూర్యాపేట, HNK, మేడ్చల్, ఉమ్మడి మెదక్ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
News September 17, 2025
BC రిజర్వేషన్లను పెంచేందుకు చర్యలు: మంత్రివర్గ ఉపసంఘం

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లోగా BC రిజర్వేషన్లను 34 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో BC రిజర్వేషన్లపై చర్చించామన్నారు. రిజర్వేషన్లను CBN 34%కి పెంచితే, జగన్ 24%కి తగ్గించారని పేర్కొన్నారు. న్యాయపరిశీలన చేసి రిజర్వేషన్లపై పకడ్బందీ చట్టం తెస్తామన్నారు. త్వరలో BC రక్షణ చట్టానికి తుది రూపం తీసుకురానున్నట్లు చెప్పారు.