News August 14, 2024
వైసీపీని విలీనం చేస్తానంటే స్వాగతిస్తాం: షర్మిల

AP: వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. వైసీపీ చీఫ్తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమన్నారు. జగన్ తిరిగి అధికారంలోకి రారని జోస్యం చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమని సెటైర్ వేశారు.
Similar News
News January 12, 2026
అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 12, 2026
మినుములో పల్లాకు తెగులు లక్షణాలు – నష్టాలు

మినుము పంటలో పల్లాకు తెగులు సోకిన తొలి దశలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా అవి ముదురు పసుపు రంగులోకి మారతాయి. కొన్నిసార్లు ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు వల్ల మొక్కలు గిడసబారి, ఎదుగుదల కుంటుపడుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది లేదా ఎండిపోతుంది. కాయలు తక్కువ సంఖ్యలో వచ్చి వాటిపై కూడా మచ్చలు వస్తాయి. ఫలితంగా గింజల నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది.
News January 12, 2026
గరుడ పురాణం ఏం చెబుతుందంటే..?

గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, కర్మ ఫలాలు, పునర్జన్మ గురించి వివరిస్తుంది. మనిషి బతికున్నప్పుడు చేసే పాపపుణ్యాలకు అనుగుణంగా యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇందులో ఉంటుంది. సృష్టి రహస్యాలు, ధర్మ సూత్రాలు, ఔషధ గుణాలు, మోక్ష మార్గాలను కూడా ఇది బోధిస్తుంది. హిందూ సంప్రదాయంలో మరణానంతరం గరుడ పురాణ పారాయణం చేయడం వల్ల ఆత్మకు శాంతి, సద్గతులు కలుగుతాయని నమ్మకం. <<-se>>#GARUDAPURANAM<<>>


