News August 15, 2024
ఆ ప్రాంతంలో నిన్న రాత్రే జెండా ఎగురవేశారు!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు ఉదయం మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. కానీ బిహార్లోని పూర్నియాలో మాత్రం నిన్న రాత్రే ఈ కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిందని తెలియగానే 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో పూర్నియాలో రామేశ్వరప్రసాద్ సింగ్ అనే వ్యక్తి అక్కడి జెండా చౌక్లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అప్పటి నుంచీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.
Similar News
News November 6, 2025
మొత్తానికి ట్రంప్కు పీస్ ప్రైజ్ వచ్చేస్తోంది!

తరచూ ఏదో ఓ ప్రకటనతో ప్రపంచానికి మనశ్శాంతి దూరం చేస్తున్న ట్రంప్కు ఎట్టకేలకు శాంతి బహుమతి రానుంది. నోబెల్ NO అన్న అమెరికా పెద్దన్నను అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఆదుకుంటోంది. వాషింగ్టన్లో వరల్డ్ కప్ డ్రా వేదికపై ఈ సారి కొత్తగా FIFA Peace Prize ఇస్తామని ప్రకటించింది. FIFA చీఫ్ గయానీ ఫుట్బాల్-పీస్ రిలేషన్ను అతికిస్తూ వివరించిన ప్రయత్నం చూస్తుంటే ఇది తన శాంతి కోసమే అన్పిస్తోంది.
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.


