News August 15, 2024
HYD: రాయితీ కోసం వాటర్ బోర్డు ఎదురుచూపు

గ్రేటర్ HYD సహా ఔటర్ ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్న వాటర్ బోర్డుకు కరెంటు బిల్లు గుదిబండగా మారింది. పంపింగ్ ద్వారా పెద్ద ఎత్తున నీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో రూ.105 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు నెలకు బిల్లులు వస్తున్నాయి. అయితే వాటర్ బోర్డు మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో రాయితీ ఇచ్చి, యూనిట్కు రూ.3.95 వసూలు చార్జీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
Similar News
News January 15, 2026
HYD: రోడ్డు మధ్యలో మెట్రో రైల్!

శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారిలో మెట్రో అధికారులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 కిలోమీటర్ల దూరం మెట్రో పిల్లర్ల మీద కాకుండా నేల మీదే (At-grade) పరుగెత్తబోతోంది. ఇది కార్ల మధ్యలో వెళ్లే ట్రైన్ కాదు బాసూ. 100 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు మధ్యలో ప్రత్యేకంగా కంచె వేసి ఈ ట్రాక్ నిర్మిస్తారు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే నిర్మాణ ఖర్చు దాదాపు 40% తగ్గుతుంది.
News January 15, 2026
HYD: ట్రాకులు రెడీ అవ్వకముందే రైళ్ల ఆర్డర్

సాధారణంగా మెట్రో స్టేషన్లు అన్నీ కట్టాక రైళ్లు కొంటారు. కానీ, మన అధికారులు మాత్రం పని మొదలవ్వకముందే 60 కొత్త కోచ్ల కోసం జనవరి 14న టెండర్లు పిలిచారు. దీన్నే “జంప్-స్టార్ట్” ప్లాన్ అంటున్నారు. ఎందుకంటే రైళ్లు రావడానికి రెండేళ్లు పడుతుంది, అందుకే ట్రాకులు తయారయ్యే లోపే రైళ్లను ప్లాట్ఫామ్ మీద ఉంచాలని ఈ ముందస్తు ప్లాన్ వేశారు. ఇందులో కెమెరాలు, సెన్సార్లు కూడా అదిరిపోయే రేంజ్లో ఉంటాయట.
News January 15, 2026
ఓల్డ్ సిటీ మెట్రో ముచ్చట.. ఇల్లు పోయినా ‘పై అంతస్తు’ ఆశ!

దారుల్షిఫా నుంచి చాంద్రాయణగుట్ట దాకా సుమారు 450 ఇళ్లు, షాపులను కూల్చేయడానికి సర్కారు మార్కింగ్ ఇచ్చేంది. ఇల్లు పోతుందని బాధపడే వాళ్ల కోసం ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఇల్లు కొంచెం పోయినా పైన రెండు అంతస్తులు ఎక్స్ట్రా కట్టుకోవడానికి ఫ్రీగా పర్మిషన్ ఇస్తారట. ఇక L&T, ప్రభుత్వానికి మధ్య జరిగిన డీల్ చూస్తే మతిపోవాల్సిందే. అప్పులన్నీ ప్రభుత్వం నెత్తిన, మెట్రో మాల్స్ మీద వచ్చే లాభాలు ఆ కంపెనీ తీసుకుంటుందట.


