News August 16, 2024

పొలానికి దారి లేదా.. ఇలా చేయండి

image

AP: పొలానికి వెళ్లేందుకు దారి లేని రైతుల కోసం ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అలాంటి సమస్య ఉన్న రైతులు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఈ చట్టం ద్వారా అన్నదాతలు భూమి హక్కు పొందవచ్చు. వెనుక ఉన్న పొలానికి ముందు ఉన్న పొలం రైతు దారి ఇవ్వాల్సిందే. లేదంటే సదరు రైతుపై కేసు నమోదు చేయొచ్చు. కౌలు రైతు చట్టంలోని సెక్షన్ 251 ప్రకారం పొలానికి వెళ్లేందుకు రైతులు రోడ్డు కూడా నిర్మించుకోవచ్చు.

Similar News

News July 10, 2025

రెండు రోజులు వైన్స్ బంద్

image

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 13, 14 తేదీల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 10, 2025

లంచ్ బ్రేక్ సమయానికి ENG స్కోర్ ఎంతంటే?

image

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ENG 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్‌లను నితీశ్ కుమార్ పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పోప్(12*), రూట్(24*) ఉన్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తొలి వికెట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.

News July 10, 2025

అకౌంట్లలోకి రూ.13,000.. చెక్ చేసుకోండిలా!

image

AP: ‘తల్లికి వందనం’ 2వ విడత డబ్బులను ప్రభుత్వం ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడతలో పలు కారణాలతో ఆగిపోయిన, ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున వేస్తోంది. నగదు స్టేటస్ కోసం వాట్సాప్ మనమిత్ర నంబర్ 95523 00009కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. అందులో తల్లికి వందనం ఆప్షన్ ఎంచుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి.