News August 16, 2024
బీఆర్ఎస్ విలీన వార్తలపై కేసీఆర్ స్పందించాలి: విజయశాంతి

TG: బీఆర్ఎస్ విలీన వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ‘బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కానుందని బీజేపీ, బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ నేతల నుంచి వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనిపై సమాధానం చెప్పవలసిన బాధ్యత కేసీఆర్కు ఉంది. రాష్ట్ర ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ జవాబు చాలా అవసరం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>