News August 18, 2024

చివరి వరకూ రహస్యంగానే(2/2)

image

ఎమిలీ ఓ భారతీయుడి వద్ద పని చేయడం ఆమె పేరెంట్స్‌కు ఇష్టం లేదు. అయితే బోస్‌ను కలిసిన తర్వాత వారు తమ అభిప్రాయం మార్చుకున్నారు. ఇక ఎమిలీతో ప్రేమలో ఉన్న సుభాష్ చంద్రబోస్ ఆమెకు తరచూ ప్రేమ లేఖలు రాస్తుండేవారు. వీరి వివాహం 1937 డిసెంబర్ 27న ఆస్ట్రియాలో జరిగింది. వీరికి ఓ కూతురు అనితా బోస్ ఫాఫ్. విదేశీ వనితను పెళ్లాడారన్న ఇమేజ్ ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివాహాన్ని వారు చివరి వరకూ రహస్యంగానే ఉంచారు.

Similar News

News July 7, 2025

మస్క్ కొత్త పార్టీ.. పడిపోయిన టెస్లా షేర్లు

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ USలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇవాళ ప్రీమార్కెట్లో టెస్లా షేర్లు 7% పడిపోయాయి. మస్క్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారాంతంలో $315.35 వద్ద ముగిసిన షేరు ధర తాజాగా $291.96కు పడిపోయింది. ఈ ట్రెండ్ కొనసాగితే సంస్థకు భారీ నష్టాలు తప్పవు. టెస్లా షేర్లు గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు 206%కు పైగా లాభాలను తెచ్చిపెట్టడం గమనార్హం.

News July 7, 2025

రాష్ట్రంలో ఘోరం.. ప్రియురాలిని పొడిచి చంపిన ప్రేమోన్మాది

image

TG: సంగారెడ్డి బండ్లగూడలో ప్రేమోన్మాది ప్రవీణ్ రెచ్చిపోయాడు. ప్రియురాలు రమ్యపై కత్తితో దాడి చేసి హత్యచేశాడు. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతోందని రగిలిపోయిన ప్రవీణ్ ఆమెతో మాట్లాడేందుకు ఇవాళ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించింది. అనంతరం తానూ అదే కత్తితో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

News July 7, 2025

దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలు నిలిపివేత

image

AP: ఈనెల 8-10 వరకు విజయవాడ దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలను నిలిపేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తూ.గో, ప.గో, కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు, వ్యాపారులు అమ్మవారి అలంకరణకు 150టన్నుల కూరగాయలు, 50టన్నుల పండ్లు స్వచ్ఛందంగా అందజేశారు.