News August 18, 2024
మహబూబ్నగర్: PU పరిధిలో 19న జరిగే పరీక్షలు వాయిదా

PU పరిధిలో ఈనెల 19న జరిగే పీజీ, బీఈడీ, ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు PU పరీక్షల నియంత్రణ అధికారి డా. రాజకుమార్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా జరిగే పరీక్షలను వాయిదా వేశామన్నారు. 19న జరిగే పరీక్షలను 23వ తేదీన జరుగుతాయని రీ షెడ్యూల్ను శనివారం యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు.
Similar News
News January 3, 2026
మహబూబ్నగర్: నేషనల్ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

విజయవాడలో ఈనెల 15 నుంచి 18 వరకు జరిగే జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన పాండు నాయక్, హేమంత్ యాదవ్ ఎంపికయ్యారు. హైదరాబాద్లో జరిగిన సెలక్షన్స్లో వీరు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. క్రీడాకారుల ఎంపికపై జిల్లా అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
News January 3, 2026
MBNR: సంక్రాంతి పండుగ.. ప్రత్యేక బందోబస్తు: SP

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లావాసులు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సందర్భాలలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు, నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News January 3, 2026
అభివృద్ధిలో MBNR జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

జిల్లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పాలమూరును అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచాలని కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్ నాయక్ సహా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పరస్పర సహకారంతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.


