News August 19, 2024

ఉద్యోగులకు ప్రమోషన్లు.. CM, Dy.CM ఫొటోలకు పాలాభిషేకం

image

TG: సదరన్ డిస్కంలో ఒకే రోజు 2,263 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో సీఎండీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ CM, డిప్యూటీ సీఎం ఫొటోలకు ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ వారంలోనే పరిష్కరించిందని పేర్కొన్నారు.

Similar News

News July 8, 2025

మహిళా సంఘాల బీమా పొడిగింపు

image

TG: మహిళా సంఘాలకు ప్రమాద బీమాను మరో నాలుగేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు 2029 వరకు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 419 మంది ప్రమాద బీమా కోసం అప్లై చేయగా 204 కేసులు సెటిల్ చేశారు. కాగా స్వయం సహాయక సంఘాల్లో 47 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు.

News July 8, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: అదే హాట్ టాపిక్!

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో TDP మద్దతు కోసం కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అక్కడ BRS గెలిచేందుకు టీడీపీ మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు పలువురు హస్తం నేతలు చెబుతున్నారు. ఈ ఆరోపణలను BRS వర్గాలు ఖండిస్తున్నాయి. 2023లో TDP మద్దతు లేకుండానే HYDలో దాదాపు అన్ని సీట్లను గెలిచామని, తమకు ఆ అవసరం లేదని పేర్కొంటున్నాయి.

News July 8, 2025

‘డిగ్రీ’ వద్దంటా..!

image

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదు. గత ఐదేళ్లుగా అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా ఈ విద్యా సంవత్సరంలో 4.36 లక్షల సీట్లకు 1.41 లక్షల విద్యార్థులే కాలేజీల్లో చేరారు. రాష్ట్రంలోని 957 డిగ్రీ కాలేజీల్లో 64 చోట్ల జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. అదే సమయంలో ఇంజినీరింగ్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.