News August 19, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహోర్లోనే: నఖ్వీ

వచ్చే ఏడాది పాక్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆ దేశానికి వెళ్లడంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ట్రోఫీ ఫైనల్ను లాహోర్ గడాఫీ స్టేడియంలోనే నిర్వహిస్తామని PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ గ్రౌండ్ పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. అన్ని మ్యాచ్లూ పాక్ గడ్డపైనే జరుగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ లభ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, స్టాక్ పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరాను సమన్వయం చేసుకోవాలని సూచించారు.
News March 13, 2026
BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

AP: ఉగాది కానుకగా PM కిసాన్తోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో 46.85 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ.6 వేల చొప్పున జమ చేశారు. వీటిలో పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలున్నాయి. మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <
News March 13, 2026
ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతుందా?.. డాక్టర్లు ఏమన్నారంటే!

మద్యం తాగితే త్వరగా నిద్ర పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది ఒక పెద్ద భ్రమ అంటున్నారు వైద్యులు. ‘ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర తగ్గి, రాత్రివేళ తరచూ మెలకువ వస్తుంది. దీంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. గురక & స్లీప్ అప్నియా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కోసం మద్యానికి దూరంగా ఉండటమే బెటర్’ అని సూచిస్తున్నారు. SHARE IT


