News August 22, 2024
అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్

TG: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓ తెలంగాణ సీఎం నిరసన చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2021 నవంబర్ 18న వరి ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పటి సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ దగ్గర నిరసనకు దిగారు. ఈరోజు అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణను డిమాండ్ చేస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈడీ కార్యాలయం దగ్గర CM రేవంత్ నిరసన చేపట్టారు.
Similar News
News November 11, 2025
స్థిరాస్తి అమ్మకం సేవా పన్ను పరిధిలోకి రాదు: SC

స్థిరాస్తి అమ్మకాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావని SC స్పష్టం చేసింది. సహారా కంపెనీకి ‘ఎలిగెంట్ డెవలపర్స్’ 2002-05లో గుజరాత్, హరియాణా, MHలోని తన భూములను అవుట్రైట్ సేల్ చేసింది. అయితే ‘రియల్ ఏజెంటు’గా అమ్మినందున ₹10.28CR సర్వీస్ ట్యాక్స్ కట్టాలని DGCEI నోటీసులు ఇచ్చింది. వీటిని సంస్థ సవాల్ చేయగా CESTAT రద్దుచేసింది. దీనిపై సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ దాఖలు చేసిన పిటిషన్పై SC తాజా తీర్పు ఇచ్చింది.
News November 11, 2025
ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <
News November 11, 2025
రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్దీప్ సింగ్

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్ AMG G63 వ్యాగన్ మోడల్తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు 585 HP పవర్, 850 NM టార్క్తో 0-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలోనే అందుకుంటుంది. ధర దాదాపు రూ.4 కోట్లు.


