News August 23, 2024
త్రిపురలో వరద బీభత్సం.. 17 లక్షలమందిపై ప్రభావం

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా త్రిపుర వరదలతో అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 19మంది మృతి చెందగా సుమారు 17 లక్షలమంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. గోమతి, దక్షిణ త్రిపుర, ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. భారత వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. జాతీయ విపత్తు స్పందన బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
Similar News
News September 14, 2025
Gen-Z పాపులేషన్ ఏ రాష్ట్రంలో ఎక్కువంటే?

Gen-Z యువత(1997-2012 మధ్య పుట్టినవారు) తలచుకుంటే ప్రభుత్వాలే కూలుతాయనడానికి నేపాల్ ఆందోళనలే నిదర్శనం. మన దేశంలో Gen-Z పాపులేషన్ 27.1% ఉందని ‘India in Pixels’ రిపోర్ట్ తెలిపింది. అత్యధికంగా బిహార్లో 32.5%, ఆ తర్వాత J&Kలో 30.8%, ఝార్ఖండ్ 30.7%, UP 30%, రాజస్థాన్ 29.2%, నార్త్ఈస్ట్లో 29.2% యువత ఉన్నారంది. ఇక TGలో 24.8%, కర్ణాటక 24.1%, AP 23.5%, TN 22%, కేరళలో 21.8% Gen-Zలు ఉన్నట్లు పేర్కొంది.
News September 14, 2025
రోజా.. నువ్వు జబర్దస్త్ చేయలేదా?: దుర్గేశ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి వైసీపీ నేత రోజాకు లేదని మంత్రి కందుల దుర్గేశ్ ఫైర్ అయ్యారు. నువ్వు మంత్రిగా ఉండి కూడా జబర్దస్త్లో పాల్గొనలేదా అని ఆయన ప్రశ్నించారు. ‘పవన్కు డబ్బు యావ లేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా. ప్రజా సమస్యలు తీర్చారా?’ అని ఆయన మండిపడ్డారు.
News September 14, 2025
టాస్ గెలిచిన భారత్

మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా నేడు AUSతో భారత మహిళల జట్టు తొలి వన్డే ఆడనుంది. IND టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: ప్రతీకా రావల్, మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్(C), రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి, స్నేహ్ రాణా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
AUS: అలీసా హీలీ(w/c), లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా మెక్గ్రాత్, జార్జియా, కింగ్, కిమ్ గార్త్, మేగాన్