News August 23, 2024

‘అచ్యుతాపురం’ ప్రమాద బాధితులకు నేడు జగన్ పరామర్శ

image

AP: అచ్యుతాపురం సెజ్‌‌లోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద బాధితుల్ని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేటి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి వెళ్లి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకుంటారు.

Similar News

News March 27, 2026

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంపు

image

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 50% నుంచి 70%కి పెంచింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖలు రాసింది. ఉక్కు, రసాయనాలు, ఆటో మొబైల్స్, వస్త్రాలు, రంగుల వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రీ క్రైసిస్ కోటాను 40% నుంచి 50%కి పెంచింది. మరోవైపు దేశంలో యూరియా కొరత లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.

News March 27, 2026

IPL జట్లకు ఆదాయం ఎలా వస్తుంది? ఏ టీమ్‌ ఎక్కువ సంపాదించింది?

image

IPLలోని 10 జట్లకు యాడ్స్, మీడియా రైట్స్, స్పాన్సర్‌షిప్స్, టికెట్ విక్రయాల ద్వారా ఆదాయం వస్తుంది. దేశ, విదేశాల్లో ఆడే టోర్నమెంట్స్ వల్ల ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. IPL, ILT20, మేజర్ క్రికెట్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడే KKR 2025లో అత్యధికంగా ₹756Cr సంపాదించింది. తర్వాతి స్థానాల్లో CSK(₹674Cr), MI(₹665Cr), SRH(₹642Cr), RR(₹635Cr), DC(₹603Cr), GT(₹559Cr), RCB(₹504Cr), PBKS(₹471Cr) ఉన్నాయి.

News March 27, 2026

ఇజ్రాయెల్‌కు పాకిస్థాన్ వార్నింగ్

image

టెహ్రాన్‌(ఇరాన్)లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో అమెరికా-ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై పాక్ తీవ్రంగా స్పందించింది. ‘మాది ఖతర్ లాంటి దేశం కాదని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించింది. కాగా ఈ దాడుల్లో దౌత్యవేత్తలకు ఎలాంటి హాని కలగలేదు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి.