News August 23, 2024
‘అచ్యుతాపురం’ ప్రమాద బాధితులకు నేడు జగన్ పరామర్శ

AP: అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద బాధితుల్ని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేటి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి వెళ్లి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకుంటారు.
Similar News
News January 20, 2026
చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: మంత్రి డోలా

AP: సింహాచలం నరసింహస్వామి చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆదేశించారు. APR 20న చందనోత్సవం సందర్భంగా 19వ తేదీ రాత్రి 6గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని SM ద్వారా భక్తులకు తెలపాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలర్ట్గా ఉండాలని చెప్పారు. FEBలో సమావేశానికి యాక్షన్ ప్లాన్తో రావాలని కలెక్టర్, ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పేర్కొన్నారు.
News January 20, 2026
ఫోన్పే IPOకు SEBI ఓకే

ఫిన్టెక్ సంస్థ ఫోన్పే IPOకు SEBI గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నియంత్రణ సంస్థ సూచనలతో అప్డేట్ చేసిన DHRPని ఫోన్పే త్వరలోనే సబ్మిట్ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో IPOకు వస్తుండటంతో కంపెనీకి పబ్లిక్ ఇష్యూ ద్వారా కొత్తగా నిధులు సమకూరే అవకాశాలు లేవు. ఫ్రెష్ ఇష్యూలు కూడా ఉండవని తెలుస్తోంది. IPO విలువ రూ.12వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుత UPI లావాదేవీల్లో 45% ఫోన్పే యాప్ ద్వారానే జరుగుతున్నాయి.
News January 20, 2026
వీధికుక్కల కేసు.. మేనకా గాంధీపై సుప్రీం ఫైర్

వీధికుక్కల అంశంపై తమ కామెంట్స్ను కించపరచడం కోర్టు ధిక్కరణేనని BJP నేత మేనకా గాంధీపై SC మండిపడింది. ‘మీరు మా వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారు. మీ క్లయింట్ ఎలాంటి కామెంట్స్ చేశారో అడిగారా? ఆమె బాడీ లాంగ్వేజ్ గమనించారా?’ అని మేనకా తరఫు లాయర్ను ప్రశ్నించింది. దీంతో తాను గతంలో కసబ్ తరఫునా వాదించానని ఆయన గుర్తుచేశారు. కానీ కసబ్ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదంటూ తదుపరి విచారణను JAN 28కి వాయిదా వేసింది.


