News August 24, 2024

“క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర” కాన్సెప్ట్ తో పవన్ బర్త్‌డే: జనసేన

image

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2)న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదామని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. వేప, చింత, ఉసిరి, రావి, నేరేడు లాంటి దేశీయ వృక్షజాతి మొక్కలు నాటుదామని తెలిపింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వీటిపై అవగాహన కల్పిద్దామని పేర్కొంది. “క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర” నినాదంతో నిర్వహిద్దామని ట్వీట్ చేసింది.

Similar News

News November 14, 2025

23వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.

News November 14, 2025

ఆ భవనాలు IT Hub కోసం కాదు: అధికారులు

image

TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాలను ఐటీ హబ్ కోసం ఉపయోగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. అవి తప్పుడు వార్తలని స్పష్టం చేశారు. అధునాతన ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వం త్వరలో సనత్‌నగర్ TIMS, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 14, 2025

రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రశాంత్ కిశోర్.. జోరుగా చర్చ

image

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ జన్ సురాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. 25 కంటే ఎక్కువ సీట్లను జేడీయూ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే శపథం చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జేడీయూ 25 సీట్లను సునాయాసంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఒత్తిడి చేయడం వల్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని జన్ సురాజ్ నేత అనుకృతి పేర్కొన్నారు.