News August 25, 2024

కరీంనగర్ చేరుకున్న ఈ-బస్సులు.. త్వరలో రోడ్లపైకి

image

TG: జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు TGSRTC సిద్ధమైంది. ఈమేరకు కరీంనగర్-2 డిపోకు ఇవాళ ఈ-బస్సులు చేరుకున్నాయి. డిపోకు మొత్తం 70 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా 33 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయి. డిపోలో ఇప్పటికే 11కేవీ విద్యుత్ లైన్లు, 14 ఛార్జింగ్ పాయింట్లు, 3 ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు.

Similar News

News November 13, 2025

విడాకుల తర్వాత భయాందోళనలకు గురయ్యా: సానియా

image

షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత తాను భయాందోళనలకు గురైనట్లు టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా చెప్పారు. ఆ సమయంలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తనకు అండగా నిలిచారని ఓ టాక్ షోలో తెలిపారు. కఠిన సమయంలో తన ప్రాణ స్నేహితురాలు తోడుగా ఉన్నారన్నారు. మరోవైపు సానియాను ఆ పరిస్థితుల్లో చూసి భయపడ్డానని, ఏమైనా ఆమెకు తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు ఫరా ఖాన్ పేర్కొన్నారు. మాలిక్‌తో సానియా 2023లో విడిపోయారు.

News November 13, 2025

ఆగాకర సాగు.. ఇలా నాటితే ఎక్కువ ప్రయోజనం

image

ఆగాకరను విత్తనం, దుంపలు, తీగ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. 2-3 సంవత్సరాల వయసుగల దుంపలు నాటుటకు అనుకూలం. తీగ కత్తిరింపుల ద్వారా అయితే 2-3 నెలల వయసున్న తీగ కత్తిరింపులను ఎంచుకోవాలి. విత్తనం ద్వారా నాటుకోవాలంటే గుంతకు 4-5 విత్తనాలు నాటుకోవాలి. ఇవి పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసి గుంతకు 2-3 ఆరోగ్యవంతమైన ఆడ మొక్కలను ఉంచాలి. దుంపల ద్వారా నాటడం రైతులకు శ్రేయస్కరం.

News November 13, 2025

స్వస్తివచనం ఎందుకు చేయాలి?

image

చేయబోయే పనులు విజయవంతం కావాలని, మనతో పాటు చుట్టూ ఉన్న అందరికీ మేలు కలగాలని కోరుతూ పలికే పవిత్ర ప్రార్థననే ‘స్వస్తి వచనం’ అంటారు. సంకల్పంతో కొన్ని ప్రార్థనలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. మన పనులకున్న అడ్డంకులు తొలగిపోతాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తే, ఆ సానుకూల శక్తి తిరిగి మనకే బలాన్నిస్తుంది. లక్ష్యాలకు విజయాన్ని చేరుస్తుంది. అందుకే ఏ కార్యాన్ని మొదలుపెట్టినా స్వస్తివచనం తప్పక ఆచరించాలి.