News August 26, 2024

4,455 బ్యాంక్ ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్

image

దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఈనెల 28తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఏదైనా డిగ్రీ చేసి, 1-8-2024 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175, ఇతరులు రూ.850 చెల్లించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపికలుంటాయి. ప్రిలిమ్స్ అక్టోబర్/నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: <>ibpsonline.ibps.in<<>>

Similar News

News July 4, 2025

ములుగు రోడ్డు జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం

image

వరంగల్ ములుగు రోడ్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ బస్సు టైరును వృద్ధుడి కాలుపై నుంచి పోనించడంతో పాదం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో గాయపడిన వృద్ధుడిని ల్యాదెళ్లకు చెందిన కొమురయ్యగా గుర్తించారు. వెంటనే అతడిని ట్రాఫిక్ పోలీసులు 108 అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. ఆర్టీసీ బస్సును మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 4, 2025

అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్.. నోటీసులు ఇచ్చే అవకాశం?

image

TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, ఇరిగేషన్&రోడ్డు కాంట్రాక్టులు చూసేది వారేనని ఇటీవల అనిరుధ్ <<16911067>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆదేశించినట్లు సమాచారం.

News July 4, 2025

దేశ వ్యతిరేక పోస్టులపై కఠిన చర్యలు?

image

దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేసే వారికి చుక్కలు చూపించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం. వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్‌ను పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులను గుర్తించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆయా అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు పోస్ట్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.