News August 28, 2024
జ్వరాలతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదు: మంత్రి సత్యకుమార్

AP: వర్షాకాలంలో జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా జ్వరాలతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూసుకోవాలన్నారు. పరిశుభ్రత, ఫాగింగ్ వంటి విషయాల్లో స్థానిక నేతల సహాయాన్ని తీసుకోవాలన్నారు. కేసులు నమోదైతే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News January 18, 2026
PCOD, PCOS రాకుండా ఉండాలంటే?

మారిన జీవనశైలి వల్ల చాలామంది అమ్మాయిలు PCOD, PCOS సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అధిక బరువుంటే వ్యాయామం చేస్తూ, సమతుల ఆహారం తీసుకుని బరువు తగ్గాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.
News January 18, 2026
టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.
News January 18, 2026
మిచెల్ మరో సెంచరీ..

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ ప్లేయర్ <<18860730>>మిచెల్<<>> 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. వరుసగా ఇది రెండో శతకం కావడం గమనార్హం. అటు ఈ సిరీస్లో 300+ స్కోరుతో కొనసాగుతున్నారు. భారత్పై వన్డేల్లో 11 ఇన్నింగ్సుల్లో మిచెల్కు ఇది నాలుగో సెంచరీ. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 36 ఓవర్లలో 201/3గా ఉంది.


