News August 28, 2024
Stock Market: కన్సాలిడేషన్ దశలోకి సూచీలు

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు కన్సాలిడేషన్ దశలోకి ప్రవేశించాయి. 81,779 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ 8 పాయింట్లు పెరిగి 81,721 వద్ద కొనసాగుతోంది. 25,030 వద్ద ఓపెనైన NSE నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 25,009 వద్ద చలిస్తోంది. LTI మైండ్ట్రీ, ఇండస్ఇండ్ బ్యాంక్, BPCL, M&M, విప్రో టాప్ గెయినర్స్. FIIలు కొనుగోళ్లు చేపట్టడంతో DIIలు లాభాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News November 11, 2025
వీరు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏడాదిలోపు పిల్లలు ఉంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు. సుపథం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. దర్శన సమయం 12PM నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. దీనికి ముందస్తు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం వద్దకు వెళ్లి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం & తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సమర్పిస్తే చాలు. వీరితోపాటు 12ఏళ్లలోపు తోబుట్టువును అనుమతిస్తారు. share it
News November 11, 2025
కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే..

కనురెప్పలు ఒత్తుగా ఉంటే ముఖం అందంగా ఉంటుంది. దీనికోసం కొన్ని సహజ చిట్కాలు..* రాత్రి పడుకొనే ముందు ఒక చుక్క ఆముదాన్ని కనురెప్పలకు రాస్తే ఒత్తుగా పెరుగుతాయి. * గ్రీన్టీలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ కనురెప్పలు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయి. గ్రీన్టీలో దూది ఉండను ముంచి కనురెప్పలపై అద్దాలి. ఇలా వారానికోసారి చెయ్యాలి. అయితే కనురెప్పలకు ఏవి రాసినా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కంట్లోకి వెళ్లి ఇబ్బంది పెడతాయి.
News November 11, 2025
ఉగ్రవాదంపై పోరాటానికి ఇండియాకు మా మద్దతు: ఇజ్రాయెల్

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ విచారం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. ఈ ఘటనపై NIA దర్యాప్తు చేయనుంది.


