News August 28, 2024
ఏపీకి కేంద్రం గుడ్న్యూస్

AP ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రధాని, ఆర్థికమంత్రి, జలశక్తి మంత్రులతో పలు దఫాలుగా సీఎం చంద్రబాబు చర్చల అనంతరం ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే పెండింగ్ నిధులనూ త్వరలోనే ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.
Similar News
News March 21, 2026
యుద్ధం.. ఇరాన్కు లాభాలు!

యుద్ధం వల్ల ఇరాన్కు నష్టాలతో పాటు లాభాలూ కలుగుతున్నాయి. గత 40 ఏళ్లుగా క్రూడాయిల్ అమ్మకుండా ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం తలెత్తడంతో అమెరికా దిగివచ్చి వాటిని ఎత్తివేసింది. ఆయిల్ అమ్ముకోవచ్చంది. ఇక హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే షిప్పులకు గతంలో ఎలాంటి ఫీజు లేకపోయేది. ఇప్పుడు ఇరాన్ ఒక్కో నౌకకు ఆయిల్ ట్యాంకర్ కంపెనీల నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తోంది.
News March 21, 2026
‘ధురంధర్-2’పై దీపిక సైలెన్స్ ఎందుకు?

‘ధురంధర్-2’పై రణ్వీర్ భార్య, హీరోయిన్ దీపికా పదుకొణె స్పందించకపోవడంపై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. భర్త విజయాలను అభినందించడంలో ముందుండే ఆమె ఈసారి ప్రీమియర్లకూ దూరంగా ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్కు ఇన్స్టాలో ప్రశంసించిన దీపిక ఇప్పుడు SM సైలెన్స్ వెనక రీజన్ ఏంటా అని చర్చించుకుంటున్నారు. కాగా దీపిక ఇటీవల రణ్వీర్ తల్లి, సోదరితో ముంబైలోని ఓ కన్సర్ట్లో మెరిశారు.
News March 21, 2026
‘భగీరథ ప్రయత్నం’ అంటే?

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడాన్ని ‘భగీరథ ప్రయత్నం’ అంటారు. పూర్వం కపిల మహర్షి కోపాగ్నికి ‘సగర’ వంశస్థులు భస్మమవుతారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చడానికి భగీరథుడు చేసిన తపస్సుకు గంగా దేవి మెచ్చారు. కానీ తన వేగాన్ని భూమి తట్టుకోలేదని చెప్పడంతో శివుడి కోసం ప్రార్థిస్తారు. ఆయన గంగను జటాజూటంలో బంధించి భూమిపైకి వదులుతారు. భగీరథుడిని అనుసరిస్తూ గంగ వెళ్లి సగరల బూడిదను తాకి మోక్షం కలిగిస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>


