News August 30, 2024
చంద్రబాబూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు: జగన్

AP: <<13972426>>గుడ్లవల్లేరు<<>> ఘటనపై YCP చీఫ్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. విపక్ష పార్టీపై బురదజల్లుడు కార్యక్రమాలతో పాలన గాలికొదిలేశారు. స్కూళ్లలో కలుషితాహారంతో వందలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు. గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టినట్లుగా వస్తున్న ఆరోపణలు తీవ్రమైనవి. చంద్రబాబూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News July 6, 2025
F-35B గురించి తెలుసా?

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
News July 6, 2025
విజయానికి 5 వికెట్లు

ఇంగ్లండ్తో రెండో టెస్టులో ఐదో రోజు భారత బౌలర్ ఆకాశ్దీప్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్(24), బ్రూక్(23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 83/5. ఇంకా 5 వికెట్లు తీస్తే భారత్దే విజయం.
News July 6, 2025
ఆట ప్రారంభం.. 10 ఓవర్ల కోత

ఐదో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నరకుపైగా నిలిచిన భారత్ VS ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆట ప్రారంభమైంది. 80 ఓవర్లు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. అటు ఇంగ్లండ్ కష్ట సాధ్యమైన 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. దీంతో ఆ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 72/3. క్రీజులో పోప్(24), బ్రూక్(15) ఉన్నారు.