News August 31, 2024
త్వరలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు!

AP: పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని గనులశాఖ చీఫ్ సెక్రటరీ ముకేశ్ కుమార్ తెలిపారు. ఆన్లైన్ విధానం అమలుపై జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక లభ్యత, ధరలపై కలెక్టర్లు నిత్యం బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారాలకు జేసీలు బాధ్యులుగా ఉంటారని, వినియోగదారులు 100శాతం సంతృప్తి వ్యక్తం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 18, 2025
KNR: ‘ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి’

అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విద్యానగర్ లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.