News September 1, 2024

గంభీర్ ఆల్ టైమ్ భారత వన్డే జట్టు.. రోహిత్ శర్మకు నో ప్లేస్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత కోచ్ తన ఆల్ టైమ్ భారత వన్డే జట్టును ప్రకటించారు. దీనికి ధోనీని సారథిగా ఎంచుకున్నారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటివ్వలేదు.

టీమ్: వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనీ, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్.

Similar News

News February 2, 2025

ఫిబ్రవరి 02: చరిత్రలో ఈ రోజు

image

✒ 1863: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం
✒ 1902: పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ జననం
✒ 1940: రచయిత ఎస్వీ రామారావు జననం
✒ 1970: ఒంగోలు జిల్లా అవతరణ
✒ 2012: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య మరణం
✒ 2023: దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం

News February 2, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 2, 2025

3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్

image

2025-26లో 2వేల జనరల్ కోచ్‌ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేస్తామని చెప్పారు. మూడేళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్, నాన్ ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త లైన్లు, డబ్లింగ్, ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.