News September 2, 2024

All Time Record: 25,300 దాటేసిన నిఫ్టీ

image

స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. NSE నిఫ్టీ సరికొత్త గరిష్ఠానికి చేరుకుంది. తొలిసారిగా 25,300 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం 84 పాయింట్ల లాభంతో 25,320 వద్ద చలిస్తోంది. ఇక BSE సెన్సెక్స్ 150 పాయింట్లు ఎగిసి 82,516 వద్ద ట్రేడవుతోంది. హీరోమోటో, HDFC లైఫ్, బజాజ్ ఆటో, టాటా కన్జూమర్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 42:8గా ఉంది.

Similar News

News February 2, 2026

జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

image

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు, ప్రియాంకా చోప్రా జంటగా రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ జార్జియాలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. డెరెక్టర్ రాజమౌళి దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారట. అలాగే మరో కీలక షెడ్యూల్‌ను అంటార్కిటికాలో చిత్రీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

News February 2, 2026

పెసరపిండి దీపం ఎందుకు వెలిగించాలంటే..?

image

ఇంట్లో దారిద్ర్యం తొలగి, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే పెసరపిండి దీపం వెలిగించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ దీపారాధన చేయడం వల్ల సుఖశాంతులు చేకూరుతాయి. పెసరపిండి దీపం బుధ గ్రహానికి ప్రీతికరమైనది, కాబట్టి ఇది వ్యాపార అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. నిత్యం పేదరికం వేధిస్తున్నా, సంపాదన నిలకడగా లేకపోయినా ఈ దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.

News February 2, 2026

రష్యా దాడిలో 15 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి

image

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై జరిపిన డ్రోన్ అటాక్‌లో 15 మంది మరణించారు. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని DTEK విద్యుత్ ఉత్పత్తి సంస్థ గనులపై రష్యా దాడులకు పాల్పడింది. షిఫ్ట్ ముగించుకొని బస్సులో ఇంటికి బయల్దేరిన కార్మికులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. మరోవైపు అబుదాబీ వేదికగా FEB 4,5 తేదీల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయి.