News September 2, 2024
ఆప్ లీడర్లలో ఒకరి అరెస్టు.. మరొకరి విడుదల
వేర్వేరు కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీలు నేతల్లో సోమవారం ఒకరు జైలు నుంచి విడుదలైతే, మరొకరు అరెస్టయ్యారు. ఆప్ MLA అమానతుల్లాను ఈడీ అరెస్టు చేసింది. వక్ఫ్ బోర్డులో అక్రమాలు, అక్రమాస్తుల కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై ED ఆయన్ను అరెస్టు చేసింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ కమ్యూనికేషన్స్ విభాగం మాజీ ఇంఛార్జ్ విజయ్ నాయర్ 23 నెలల తరువాత జైలు నుంచి విడుదలయ్యారు.
Similar News
News February 2, 2025
కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం
మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.
News February 2, 2025
తెలుగులో అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్
*ప్రషు బేబీ- 11.4 మిలియన్స్
*హర్ష సాయి ఫర్ యూ తెలుగు- 10.9M
*తేజ్ ఇండియా- 5.56 M
*ఫిల్మిమోజి (ఎంటర్టైన్మెంట్)- 5.31M
*షణ్ముఖ్ జశ్వంత్- 4.93M.
*ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు- 4.73M
*శ్రావణి కిచెన్- 4.7M
*బ్యాంకాక్ పిల్ల- 3.61M
*అమ్మచేతి వంట- 3.52M
*మై విలేజ్ షో- 3.1M
*మీడియాకు మినహాయింపు. ఇవి పర్సనల్ ఛానల్స్.
News February 2, 2025
వాణిజ్య పోరులో విజేతలు ఉండరు: చైనా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై తమ ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని విధించడాన్ని చైనా ఖండించింది. ‘వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు. ఏకపక్షంగా సుంకాలు విధించడం ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) నిబంధనల్ని అమెరికా తీవ్రంగా ఉల్లంఘించింది. మా దేశ హక్కుల్ని, ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు కచ్చితంగా అమెరికాకు తగిన విధంగా బదులిస్తాం’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.