News September 2, 2024
భారత జట్టుకు సూర్య దూరం?
బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతూ గాయపడ్డ భారత ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ రౌండ్కు దూరమవనున్నారు. SEP 5 నుంచి ప్రారంభం అయ్యే ఈ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు జట్టును BCCI ఎంపిక చేయనుంది. సీనియర్లు కాక భారత జట్టులో చోటు ఆశిస్తున్న వారు ఈ ట్రోఫీ ఆడుతున్నారు. దీంతో SKY భారత జట్టుకు దూరమయ్యే ఛాన్సుంది. సెప్టెంబర్ 19 నుంచి BANతో టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది.
Similar News
News September 18, 2024
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP: వాలంటీర్లపై NDA శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాలంటీర్ల పదవీకాలం ఏడాది క్రితమే పూర్తైతే, రెన్యూవల్ చేయలేదు. వాళ్ల పేరోల్స్(జీతాల బిల్లులు) కూడా లేరు. వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డుల్లోనే లేకుండా పోయారు. కానీ మనం 3 నెలల జీతం ఇచ్చాం. కొందరు రాజీనామా చేశారు. చేయని వాళ్లకు ఇచ్చిన ఆర్డర్స్కు కూడా గడువు ముగిసింది’ అని సీఎం వ్యాఖ్యానించారు.
News September 18, 2024
MPగానే పెళ్లి చేసుకుంటా: కంగనా రనౌత్
సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఎంపీగా పదవిలో ఉండగానే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దేవుడి దయ వల్ల అది జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా 38 ఏళ్ల కంగన హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరోవైపు ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
News September 18, 2024
IND vs BAN: రేపటి నుంచే తొలి టెస్టు
భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. 258 రోజుల తర్వాత రోహిత్, కోహ్లీ, బుమ్రా కలిసి టెస్టు ఆడనున్నారు. ఈ మ్యాచ్లో గెలిచి ఓవరాల్ ఓటముల కన్నా గెలుపుల సంఖ్య పెంచాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరో వైపు పాకిస్థాన్ను వైట్వాష్ చేసిన ఊపులోనే భారత్పై కూడా గెలవాలని బంగ్లా తహతహలాడుతోంది. ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో ఎవరు ఉండాలో కామెంట్ చేయండి.