News September 4, 2024

4G కోసం BSNLకు మరో రూ.6000 కోట్లు

image

BSNLకు మరో రూ.6వేల కోట్లు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. కస్టమర్లను పోగొట్టుకోకుండా వేగంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్ష 4G సైట్లు నెలకొల్పేందుకు కంపెనీ నిరుడు రూ.19వేల కోట్లతో TCS, ITIకి ఆర్డర్లు ఇచ్చింది. రూ.13వేల కోట్లే చెల్లించడంతో మరో రూ.6వేల కోట్లు అవసరం అయ్యాయి. 2019 నుంచి BSNL, MTNLలో కేంద్రం రూ.3.22 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.

Similar News

News September 20, 2025

బొప్పాయిలో మొజాయిక్ వైరస్ లక్షణాలు

image

బొప్పాయి తోటల్లో మొజాయిక్ వైరస్ విత్తనం, పేను ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులపై అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పూర్తిగా ఆకు పసుపు రంగుకు మారుతుంది. అందుకే దీనిని పల్లాకు తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన ఆకులు ముడుచుకుపోయి పెళుసుగా మారతాయి. మొక్కలు సరిగా ఎదగవు. బలహీనంగా కనిపిస్తాయి. కాయల్లో నాణ్యత ఉండదు. పండ్లు చిన్నవిగా, వికృతంగా తయారవుతాయి.

News September 20, 2025

బొప్పాయిలో తెగుళ్ల నివారణకు సూచనలు

image

నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి తప్పక చేసుకోవాలి. నర్సరీల నుంచి మొక్కలను తీసుకుంటే వైరస్ తెగుళ్ల లక్షణాలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా మొక్కలో వైరస్ తెగులు లక్షణాలు కనిపిస్తే దాన్ని పంట నుంచి తీసేసి దూరంగా కాల్చివేయాలి. తోటలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బొప్పాయి నారు మొక్కలను పొలంలో నాటే 3 రోజుల ముందే లీటరు నీటికి 1.5గ్రా. అసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

News September 20, 2025

మంత్రులు, న్యాయ నిపుణులతో నేడు సీఎం భేటీ

image

TG: స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులకు సమాచారం అందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్ల అంశంలో న్యాయపరమైన ఇబ్బందులపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి న్యాయ నిపుణులు కూడా రావాలని CMO నుంచి సమాచారం ఇచ్చారు.