News September 5, 2024

చంద్రబాబు నిర్ణయంపై విచారణకు సిద్ధం: సీబీఐ

image

2003లో చంద్రబాబు సీఎంగా ఉండగా ఐఎంజీ సంస్థకు 850 ఎకరాలను అక్రమంగా కేటాయించారని ఆరోపిస్తూ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. న్యాయస్థానం ఆదేశిస్తే చంద్రబాబు క్యాబినెట్‌ నిర్ణయంపై విచారణకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో తాము ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పారు. ఈ పిల్‌పై నేడు కూడా కోర్టులో విచారణ జరగనుంది.

Similar News

News September 16, 2025

ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి

image

తెలంగాణలో నలుగురు IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. NVS రెడ్డిని HMRL ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయనను ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుడిగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. HMDA సెక్రటరీగా శ్రీవాత్సవ, SC గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యలకు అదనపు బాధ్యతలిస్తూ నిర్ణయించింది. పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

News September 16, 2025

కడియం శ్రీహరి దారెటు? రాజీనామా చేస్తారా?

image

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్‌కు MLA కడియం శ్రీహరి ఇంకా సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇతర ఎమ్మెల్యేల తరహాలో BRSలోనే ఉన్నానని సమాధానం ఇస్తారా? రాజీనామా చేసి ఉపఎన్నికలో మళ్లీ గెలిచి విమర్శకుల నోరు మూయించాలనే యోచనలో ఉన్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే తనకు చివరి ఎన్నికలని గతంలో ప్రకటించిన ఆయన ఇప్పుడు రిస్క్ ఎందుకు అనుకుంటారా అనేది చూడాలి.

News September 16, 2025

OG రిలీజ్.. పేపర్లతో థియేటర్ నిండిపోతుంది!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది భారీ అంచనాల మధ్య రిలీజయ్యే ‘OG’కి ఇంకెంత క్రేజ్ ఉండాలి. ఈనెల 25న ఫ్యాన్స్ షోలో థియేటర్లను పేపర్లతో నింపేందుకు అభిమానులు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరిలోని సాయి రామ్ థియేటర్‌లో స్పెషల్ షో కోసం ఏర్పాటు చేసిన పేపర్స్ చూసి ఇతర అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వందల కేజీల న్యూస్ పేపర్లను కట్ చేయడం విశేషం.