News September 9, 2024
రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు: హరీశ్

TG: MLAల అనర్హత పిటిషన్లపై హైకోర్టు <<14057734>>తీర్పును <<>>స్వాగతిస్తున్నట్లు BRS MLA హరీశ్రావు వెల్లడించారు. ‘కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు ఈ తీర్పు చెంప పెట్టు. పార్టీ మారిన MLAలు అనర్హతకు గురికావడం తథ్యం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు ఉంది. అనర్హత వల్ల ఉపఎన్నికలు జరిగే చోట్ల BRSదే గెలుపు. కోర్టు తీర్పును స్పీకర్ 4 వారాల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నాం’ అని Xలో ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.