News September 9, 2024
కోల్కతా వైద్యులకు సుప్రీం కోర్టు అల్టిమేటం

కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచారంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న డాక్టర్లకు సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. రేపు సాయంత్రం ఐదింటికల్లా వారంతా తమ విధులకు హాజరుకావాలని తేల్చిచెప్పింది. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలపై భారత వైద్య సంఘం(IMA) బెంగాల్ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైద్యులకు అండగా నిలుస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
Similar News
News September 16, 2025
పిల్లలకు డైపర్లు వేస్తున్నారా?

పిల్లలకు డైపర్లు వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. *2 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడొచ్చు *ఇంట్లో ఉన్నప్పుడు కాటన్వి, ప్రయాణాల్లో డిస్పోజబుల్ డైపర్లు వాడటం మేలు *డైపర్లను ఎక్కువసేపు మార్చకుండా వదిలేస్తే ఒరుసుకుపోవడం, గజ్జల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది *డైపర్ విప్పాక అవయవాలకు గాలి తగిలేలా ఉండాలి *గోరువెచ్చని నీళ్లతో కడిగేసి సున్నితంగా కాటన్ బట్టతో అద్దాక కొత్తది వేయాలి.
News September 16, 2025
సూర్యను నీరజ్ చోప్రా ఫాలో అవుతారా?

ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్కు భారత కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇప్పుడు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. రేపు, ఎల్లుండి టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ ఛాంపియన్, పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్ను నీరజ్ ఎదుర్కోనున్నారు. మరి షేక్ హ్యాండ్ విషయంలో SKYని భారత త్రోయర్ ఫాలో అవుతారా అనే చర్చ మొదలైంది.
News September 16, 2025
కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.