News September 12, 2024

What a Rally: సెన్సెక్స్ 1439, నిఫ్టీ 470 పాయింట్లు అప్

image

స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ రికార్డులు బద్దలు కొట్టాయి. సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. NSE నిఫ్టీ ఏకంగా 470 పాయింట్లు లాభపడి 25,388 వద్ద ముగిసింది. 15 నిమిషాల్లోనే 193 పాయింట్లు ఎగిసింది. BSE సెన్సెక్స్ 1439 పాయింట్లు ఎగిసి 82,962 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్ల మేర సంపద పోగేశారు. నిఫ్టీలో నెస్లే తప్ప అన్ని షేర్లూ పెరిగాయి. హిందాల్కో, ఎయిర్‌టెల్, NTPC టాప్ గెయినర్స్.

Similar News

News November 16, 2025

TELANGANA NEWS

image

✦ టోక్యో డెఫ్లింపిక్స్-2025 షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు రూ.1.20కోటి నజరానా: మంత్రి శ్రీహరి
✦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో BJP MP ఈటల భేటీ.. కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని, బాలానగర్-నరసాపూర్ హైవేలో, నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ వైపు ఫ్లై ఓవర్లు నిర్మించాలని విజ్ఞప్తి
✦ తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. అర్హులందరికీ ఇస్తాం: మంత్రి పొంగులేటి

News November 16, 2025

WTC: నాలుగో స్థానానికి పడిపోయిన భారత్

image

SAతో తొలి టెస్టులో ఓటమితో భారత్ WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమ్ ఇండియా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు, 3 ఓటములు, ఓ మ్యాచ్ డ్రాగా ముగించింది. ప్రస్తుతం IND విజయాల శాతం 54.17గా ఉంది. ఇక ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన AUS అగ్రస్థానంలో ఉండగా, సఫారీలు(విజయాల శాతం 66.67) రెండో స్థానంలో ఉన్నారు. 3, 5, 6, 7వ స్థానాల్లో SL(66.7), PAK(50.00), ENG(43.33), BAN(16.7) ఉన్నాయి.

News November 16, 2025

టెట్​ ఫలితాల విడుదల అప్పుడే: విద్యాశాఖ

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)​ దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 03 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ​పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10-16వ తేదీ మధ్య వెల్లడిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్​ కోటా అభ్యర్థులు కూడా జనరల్​ కోటా మాదిరిగానే మార్కులు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది.