News September 12, 2024

పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి: CBN

image

AP: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘అట్టడుగు వర్గాలతో ఏచూరికి మంచి అనుబంధం ఉంది. పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి. దేశ రాజకీయాల్లో గౌరవస్థానం పొందారు’ అని చంద్రబాబు అన్నారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని మంత్రి లోకేశ్ అన్నారు. ఏచూరికి కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News October 18, 2025

ధన త్రయోదశి ఎందుకు జరుపుకొంటారు?

image

ధంతేరస్‌ను జరుపుకోవడానికి ప్రధాన కారణం.. ఈ రోజున ఆరోగ్య ప్రదాత ధన్వంతరి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించడం. ఈ పండుగను దీపావళికి శుభారంభంగా పరిగణిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతాయి. నూతన పెట్టుబడులకు, విలువైన వస్తువుల కొనుగోలుకు ఇది శుభ సమయం. అలాగే ఇల్లు, మనస్సులను శుద్ధి చేసుకొని పండుగకు సిద్ధపడడం ద్వారా ఆనందం, అదృష్టం లభిస్తాయని ఈ పండుగ తెలియజేస్తుంది.

News October 18, 2025

PM జన్‌మన్ అమలులో TGకి మూడో ర్యాంక్

image

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(PM JANMAN) అమలులో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘ఆది కర్మయోగి అభియాన్’ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. గిరిజన సమూహాల సమాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు కేంద్రం 2023 నవంబర్‌లో ఈ పథకం ప్రారంభించింది.

News October 18, 2025

నేడు ఇలా చేస్తే సకల శుభాలు

image

నేడు ధన త్రయోదశి పర్వదినం. ఈరోజున ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ‘ఈ శుభ దినాన బంగారం, వెండి, లోహ పాత్రలు, కొత్తిమీర, కొత్త చీపురు కొనడం శుభప్రదం. ప్రధాన ద్వారం వద్ద యముడికి దీపాన్ని దానం చేయడం ద్వారా అకాల మృత్యు భయం తొలగుతుంది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం లభించి, సంపద వర్షిస్తుంది’ అని పేర్కొంటున్నారు.